Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం
- విడుదలైన నాయకులకు స్వాగతం
నవతెలంగాణ-జోగిపేట
'ఆశాల సమస్యలపై మంత్రిని నిలదీస్తే జైలుకు పంపుతారా?' అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాణి క్యం ప్రశ్నించారు. అక్టోబర్ 4వ తేదీన మెదక్ జిల్లా నారాయణఖేడ్ సభలో మంత్రి కేటీఆర్ను ఆశాలతో కలిసి ఆ యూనియన్ డివిజన్ కార్యదర్శి చిరంజీవులు, నాయకుడు రవి సమస్యలపై నిలదీశారు. అయితే పోలీ సులు... వారిని సోమవారం అరెస్టు చేసి, జైలుకు పంపారు. మంగళవారం జైలు నుంచి విడుద లైన వారికి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భ ంగా మాణిక్యం మాట్లాడుతూ... అరెస్టులతో ఉద్యమా లను ఆపలేరని, ఆశాలకు అండగా ఉంటూ ప్రభుత్వా నికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.