Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యంత్రాంగం
ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. భిక్షాటన చేసి, కూరగాయలు అమ్ముతూ, రోడ్లు ఊడ్చి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి.... పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. పలుచోటల సీఐటీ యూ నాయకులు సమ్మెకు మద్దతు ప్రకటించి, మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మల్కాజిగిరి, అల్వాల్ ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఆశావర్క ర్లు తాళ్లబస్తీలో, కూత్బుల్లాపూర్ మండలంలోని దూలపల్లిలో భిక్షాటన చేశారు. వరంగల్ ఏకశిలా పార్కులో చేపట్టిన ఆశాల దీక్షలకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాకుబీ సంఘీభావం సందర్శించి, మాట్లాడారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో కూరగాయలు అమ్ముతూ, ఖమ్మం రూరల్లో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా దోమకొం డలోని ఆశాల సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిద్ధిరాములు సందర్శించి మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్, తిమ్మాపూర్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆశావర్కర్లు సమ్మె శిబిరంలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వనపర్తిలో నల్లచీరలు ధరించి, అడ్డాకులలో మర్రిచెట్టు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూ ల్లో ఆశాల దీక్షకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు మద్దతు తెలిపారు. మెదక్ జిల్లా జోగిపేటలో ఆశాలు మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. చిన్నశంకరం పేటలో చేగుంట మెదక్ రహదారిపై ఆటలాడారు. మిర్దొడ్డిలో భిక్షాటన చేసి నిరసన తెలి పారు. సంగారెడ్డి సమ్మె శిబిరం వద్ద ప్రభుత్వ వైఖరి నశించాలని నినాదాలు చేశారు.