Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓ యువతి నుంచి బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు నగరపోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. శనివారం బషీర్బాగ్ సీపీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపర్చొదంటూ ఢిల్లీ నుంచి సంజనా చౌదరి అనే మహిళ తనను బెదిరిస్తుందంటూ ఆయన తెలిపారు. విచారణ చేపట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామని సీపీ హామీనిచ్చినట్టు ఆయన తెలిపారు.