Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గురుకుల డైరెక్టర్ ప్రవీణ్కుమార్
నవతెలంగాణ-అచ్చంపేట
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థు లను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే స్వేరోస్ లక్ష్యమని రాష్ట్ర గురుకుల డైరెక్టర్ డా.ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలో స్వేరోస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ను ఆయన సందర్శించారు. అనంతరం పట్టణంలోని కందూరి ఎల్లయ్య ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల వికాసం కోసం స్వేరోస్ ఎంతో కృషి చేస్తోందని గుర్తుచేశారు. సమావేశంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.ఆశన్న, కేంద్ర కమిటీ కార్యదర్శి స్వాములు, జిల్లా ఉపాధ్యక్షులు విజరుకుమార్, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, తాలూకా అధ్యక్షులు మనోహర్ పాల్గొన్నారు.