Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ మహిళలు రక్షణ చట్టాలపై తెలుసుకోవాలి :
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటరత్నం
నవతెలంగాణ-సంగారెడ్డి
యువత ముందుకు వచ్చి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, గ్రామీణ మహిళలకు ఈ చట్టాల గురించి తెలియజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. శనివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల గురించి ఎన్ని చట్టాలు చేసినా అవి పకడ్బందీగా అమలు కాకపోవడంతో న్యాయం జరగడం లేదన్నారు. రెండు రోజుల పాటు సంగారెడ్డిలో మహిళా సంఘాలకు చట్టాలపై శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. నిర్భయ లాంటి కొత్త చట్టాలు వచ్చినా కొందరు దుండుగులు ఎన్నో రకాలుగా మహిళలను వేధిస్తున్నారన్నారు. చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉన్నప్పుడే వాటిని వారు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.