Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాల్లో 9 మంది మృతి ొ28 మందికి గాయాలు
నవతెలంగాణ-యంత్రాంగం
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఆదివారం ఒకే రోజు 9మంది మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. వీరిలో ఓ బాలుడు, వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారం బైపాస్ వద్ద శనివారం రాత్రి రెండు బస్సులు ఢకొీన్నాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్తున్న డీలక్స్ బస్సు అదుపు తప్పి బైపాస్ వద్ద డివైడర్ను దాటి కుడివైపునకు వెళ్లింది. అదే సమయంలో నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సును ఢకొీన్నది. దీంతో నిర్మల్ బస్సులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్కు చెందిన పండరి(35), బీహార్కు చెందిన ఉద్ధవ్(32)లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. డీలక్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని చేగుంట ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్ వద్ద కారును ద్విచక్రవాహనం ఢకొీని తల్లీకూతురు మరణించారు. సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన గుండోజు గంగవ్వ(55) కొడుకు, కూతురుతో కలిసి ద్విచక్ర వాహనంపై కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా తిమ్మాపూర్ వద్ద వారి వాహనాన్ని జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు వెళ్తున్న కారు వేగంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న గంగవ్వ, ఆమె కూతురు భవాని(27) అక్కడికక్కడే మృతిచెందారు. గంగవ్వ కొడుకు గంగరాజం తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని స్థానికులు జగిత్యాల ఏరియాస్పత్రికి తరలించారు. కారు కూడా బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఎడ్మల జగన్మోహన్రెడ్డితోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఖానాపూర్ శివారులో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిగంపేటకు చెందిన వడ్డె వెంకటన్న (50), ఖానాపూర్కు చెందిన బోయ లక్ష్మన్న (45) మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ను బొలేరో వాహనం ఢకొీట్టడం ఈ ప్రమాదం సంభవించింది. బాలానగర్ మండలం రాజాపూర్ బస్టాండ్ కూడలి వద్ద హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రాజ్ గుప్తా (70), అనిరుధ్ (16) మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వనపర్తి మండల పరిధిలోని తిరుమలాపురం సమీపంలో ఆటో బోల్తా పడగా సింగాయిపల్లి గ్రామానికి చెందిన శేఖర్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. పెబ్బేరు మండల సమీపంలోని వనపర్తి రోడ్డుపై కారు బోల్తా పడింది. ఇక్కడ 8 మందికి గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న వెంకట్రాంరెడ్డి తల్లి నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉన్నది.