Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-పటాన్చెరు
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని శాండ్విక్ పరిశ్రమ ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించిన సాధారణ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు, ఎస్.వీరయ్య హాజరయ్యారు. కార్మిక సంఘం ఏర్పాటై 30ఏండ్లు పూర్తయిన సందర్భంగా సావనీర్ను ఆవిష్కరిం చారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక కార్మిక యూనియన్లకు శాండ్విక్ యూని యన్ మార్గదర్శకమన్నారు. పెట్టుబడి దారీ విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని, మన దేశంపైనా ఆ ప్రభావం పడిందని అన్నారు. పెట్టుబడుల కోసం మోడీ ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా కొత్త పరిశ్రమలేవీ రాలేదన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గాయని, నిరుద్యోగ యువతలో విశ్వాసం సడలుతోందని అన్నారు. ప్రజల్లో అసంతృప్తి వల్లే ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీ వరుస ఓటములు చవిచూసిందన్నారు. ఢిల్లీలోని జేఎన్ యూ పరిణామాలు, హెచ్సీ యూలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. పంట లకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని, దళారు ల రాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వా నికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మాట్లాడు తూ.. ఒక ప్రయివేటు పరిశ్రమలో కార్మికవర్గం తమ ప్రయోజ నాలు కాపాడు కుంటూనే 31ఏండ్లు పూర్తి చేసుకోవ డం చరిత్రాత్మకం అన్నారు. ఇది శాండ్విక్ కార్మికుల చైతన్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమం లో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పాండురం గారెడ్డి, ఉపా ధ్యక్షుడు మనోహర్, సహాయ కార్యదర్శి బీవీఆర్కె.రాజు, కోశాధికారి ఎస్.శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.