Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
దళిత బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామంతపూర్ వెంకట్రెడ్డినగర్కు చెందిన మైనర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అంబర్పేట పటేల్నగర్కు చెందిన రాజేష్ ఆటోడ్రైవర్. అప్పుడప్పుడు వెంకట్రెడ్డినగర్ పాఠశాలకు వస్తుండటంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో దేవేంద్రనగర్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి అదేరోజు రాత్రి అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో హుటాహుటిన చేరుకొని విచారణ చేపట్టారు. ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.