Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఖమ్మం, వరంగల్లో తడిసిన మిర్చి
-నీళ్లల్లో కొట్టుకుపోతుండగా వలలు వేసిన రైతులు
ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాలవర్షానికి కల్లాల్లో, మార్కెట్యార్డుల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాలవర్షాలతో మిర్చి రైతులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది మిర్చికి ధర ఉందని సంతోష పడుతుండగానే అకాలవర్షాలు వచ్చి తమను నిలువునా ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-యంత్రాంగం
ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాలవర్షానికి కల్లాల్లో, మార్కెట్యార్డుల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాలవర్షాలతో మిర్చి రైతులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది మిర్చికి ధర ఉందని సంతోష పడుతుండగానే అకాలవర్షాలు వచ్చి తమను నిలువునా ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా గార్ల మండలం సీతంపేట, ముల్కనూరు, పోచారం, ముక్తితండా, పిన్నిరెడ్డిగూడెం, మర్రిగూడెం, రాంపురం తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన సుమారు 2వేల క్వింటాళ్ల మిర్చి తడిసిపోయింది. కొత్తగూడెం మండలం బంగారుచలక, మైలారం, రేగళ్ల, గట్టుమల్ల, కారుకొండ, హేమచంద్రాపురం, సుజాతనగర్, అనిశెట్టిపల్లి, పెనగడప గ్రామాల్లోనూ సుమారు రెండువేల క్వింటాళ్ల మిర్చికి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ఏన్కూరు మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన, కల్లాల్లో ఆరబోసిన పత్తి సైతం తడించింది. అకస్మాత్తుగా వర్షం పడడంతో రైతులు పరదాలు కూడా కప్పలేని పరిస్థితి ఏర్పడింది. బూర్గంపాడు మండలంలోనూ చాలా చోట్ల మిర్చి తడిసింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ డివిజన్లో కురిసిన భారీ వర్షానికి మిర్చి కల్లాలు తడిశాయి. కోయకుండ మొక్కలపై ఉన్న మిర్చిపంట నేల రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా చోట్ల మిర్చి నీళ్లలో కొట్టుకుపోయింది. రైతులు వలలు వేసి కాయలు వేరుకున్నారు. మహబూబాబాద్ డివిజన్లో సుమారు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు సమాచారం. కురవి మండలంలో తడిసిన మిర్చి కల్లాలను డోర్నకల్ టిఆర్ఎస్ ఎంఎల్ఏ రెడ్యానాయక్ పరిశీలించారు. విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలియజేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తడిసిన మిర్చిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏటూరునాగారం, రామన్నగూడెం, రామ్నగర్, ముప్పనపల్లి, రోయ్యూర్, శంకరాజుపల్లి, ముల్లకట్ట రాంపూర్, ఏటూ రు, సింగారం ఇలా ఆయా గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్ద యిం ది. ములుగు మండలంలోని అరటి, మిరప, మొక్క జొన్న రైతులు భారీగా నష్టపో యారు. సుమారు 400 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారుల ప్రాథమిక అంచనా. అబ్బాపూర్, రాంచంద్రాపూర్ గ్రామాల్లో సుమారు 105 హెక్టార్లలో అరటి పంట నష్టం జరిగింది. అబ్బాపూర్లోనే సుమారు 300 హెక్టా ర్లలో మొక్క జొన్న ఎక్కడిక్కడే అడ్డం పడిపోయింది. దీంతో మొక్కజొన్న రైతు లు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మామిడి తోట, మొక్కజొన్న పంటలు దెబ్బతి న్నాయి. పాతగూడురు, సూరారం, అంబారుపేట, గుల్లకోటలో సుమారు 100 ఎకరాల్లో మామిడితోట, కొండాపూర్, జగదేవ్పేట, చర్లపల్లిలో 11 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయినట్టు మండల వ్యవసాయ అధికారి బొడ్డు సత్యం తెలిపారు.