Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క పూట బడి పెట్టండి
- సీఎంకు పీఆర్టీయు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయని, వెంటనే ఒక్క పూట బడి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు పీఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. చెన్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గతంలో 30నుంచి 35డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడే ఒంటిపూట బడులు నిర్వహించారని, ఇప్పుడు 40నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. స్కూళ్లలో మౌలిక వసతులు లేకపోవడం, తాగడానికి నీళ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటికి తోడు ఎండలు తీవ్రతరం అయినందున వెంటనే ఒక పూట బడికి నిర్ణయం తీసుకోవాలని కోరారు.