Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్ : ఉద్యోగుల విభజనలో కమల్నాథన్ కమిటీ తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను కలిసి వినతిపత్రం అందించారు. ఆంధ్రాకు ఆప్షన్ ఇచ్చుకున్న ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తున్నారని, ఇలాంటి అక్రమ కేటాయింపులు ఆపాలన్నారు. ఆయనతో పాటు టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, వెంకటయ్య, సహదేవ్, కృష్ణయాదవ్, రాజ్కుమార్ గుప్త, యోగానంద్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.