Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధమైన ఇండ్లను లబ్దిదారులకు ఇవ్వండి : సబితా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పేదల స్వంత ఇంటి కల నేరవేర్చేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, 412 ఎకరాలలో 32 ప్రాంతాలలో దాదాపు 80 వేల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టామని హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 1742 కోట్ల రూపాయలు వ్యయం చేశామని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మల్కాజిగిరి ఇన్చార్జి నందికంటి శ్రీధర్ తదితరులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెబుతుందని, అందుకోసం వారం రోజుల్లోనే ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే లక్షా 73వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. దీన్ని బట్టి ప్రజలు ఇండ్ల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుందన్నారు.గ్రేటర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం చేస్తామన్న ప్రణాళికతో ఉందని, అందువల్ల తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణమై సిద్ధంగా ఉన్న దాదాపు 30వేల ఇండ్లు లబ్దిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా ప్రభుత్వం ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరుతున్నాయని అందుకోసం ఇస్తున్న సలహాలు స్వీకరించి ఇండ్లను లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేశారు.బేషజాలకు పోకుండా లబ్దిదారులకు పంచి పెట్టాలన్నారు.