Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముత్తారం
అప్పుల బాధతో ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం పోతారంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బియ్యాని మల్లేష్(35) ఖరీఫ్లో రెండెకరాలు కౌలు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట చేతికి రాలేదు. పెట్టుబడి నిమిత్తం రూ.5లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. చేతికి చిల్లి గవ్వ రాలేదు. మరోవైపు అప్పు చెల్లించాలని ఒత్తిడి తీవ్రమైంది. దీంతో మనస్థాపానికి గురైన మల్లేష్ ఉదయం చేనులోనే పురుగుల మందు తాగాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.