Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
సరదాగా స్నానానికెళ్లిన నలుగురు యువకులు చెరువులో మునిగి చనిపోయిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్బన్, కాలపత్తార్ ప్రాంతాలకు చెందిన తొమ్మిదిమంది యువకులు ఆదివారం లకీë గూడలోని కొత్తచెరువులో స్నానం చేయడానికెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. వీరిలో ఎస్కె.అమరుద్దీన్(18), ఎస్కె.ఫరూఖ్(25), సల్మాన్ ఖాన్(17), ఆసిఫ్ ఖాన్(17) స్నానం చేసే క్రమంలో చెరువులోపలికెళ్లారు. లోతుకు వెళ్లేసరికి ఈతరాక నీటిలో మునిగిపోయారు. మిగతా ఐదుగురు ఏమీ చేయలేక కేకలు వేసినప్పటికీ చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్లో సమాచారం అందించారు. పోలీసు బృందం గజ ఈతగాళ్ల సహాయంతో నలుగురి మృతిదేహాలను వెలికి తీసింది. మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.