Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు పిల్లల్ని కడతేర్చిన కసాయి తండ్రి
నవతెలంగాణ-ఎడపల్లి
భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చాడో కసా యి తండ్రి. పిల్లలు కేకలు వేసినా కనికరం లేకుండా గొంతుపై తొక్కి చంపే శాడు. ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేటలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన చంద్రశేఖర్కు, ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన ప్రమీలకు 14ఏండ్ల కింద పెండ్లయింది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. చంద్రశేఖర్ భార్య వివాహేతర సంబంధం కొనసాగి స్తున్నదని అనుమానం పెంచుకున్నాడు. కొంతకాలంగా ఆమెను తీవ్రంగా వేధిస్తూ తరచూ గొడవపడేవాడు. పిల్లలు కూడా తనకు పుట్టలేదని అనుమా నంతో హింసించేవాడు. ఇటీవలే పిల్లల్ని వదిలి ప్రమీల పుట్టింటికి వెళ్లిపో యింది. ఇదే అదనుగా భావించిన చంద్రశేఖర్ ఆదివారం ముగ్గురు పిల్లల్ని తీసుకుని జాన్కంపేటలోని ఆలీసాగర్ రిజర్వాయర్ వద్దకు తీసుకుపోయా డు. అక్కడ బీ-40 కెనాల్లో ముందుగా పెద్ద కుమారుడు సాత్విక్ను(8), కూతురు మోక్ష(5)ను నీటిలో ముంచాడు. కేకలు వేసినా కనికరించకుండా కాలితో గొంతుపై తొక్కి చంపేశాడు. తర్వాత 13నెలల బాబు సోమేష్నూ నీటిలో ముంచేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక యువ కులు గమనించి నిందితున్ని పట్టుకున్నారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. చంద్రశేఖ ర్కు దేహశుద్ధి చేసి గ్రామానికి తీసుకుపోయారు. పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.