Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
పాత డీఎస్సీ(1998,2002,2008,2012) క్వాలిఫైడ్ టీచర్లకు ఉద్యోగాలిచ్చి ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ బంజారా విద్యావంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 3న సీఎం కేసీఆర్ స్వయంగా పాత డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల ప్రతినిధులతోముఖాముఖి చర్చలు జరిపారని, దీనిలో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికైనా ఈ హామీ అమలు అయ్యేలా చూడాలని కోరారు.