Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 47 గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఈనెల 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ కార్యదర్శి బీ శేషుకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 27న నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను http://tsrjdc.cgg.gov.in వెబ్సైట్లో పెట్టినట్టు చెప్పారు. మొదటిలిస్టు కౌన్సెలింగ్కు ఎంపికైన అభ్యర్థులకు కాల్లెటర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు కాల్లెటర్లో తెలిపిన కౌన్సెలింగ్ కేంద్రాలకు గురువారం ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. కుల, ఆదాయ, స్టడీ, బోనఫైడ్ మరియు ప్రత్యేక కేటగిరి మొదలైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో రావాలని కోరారు.