Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఎంకు సిపిఐ ఎమ్మెల్యే లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన దళితులకు మూడు ఎకరాల భూ పంపిణికీ సంబంధించిన వివరాలను అందజేయాలని సిపిఐ ఎమ్మెల్యే ఆర్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. రాష్ట్రంలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టీ ఏడాదవుతుందని, ఇప్పటికీ ఎంతమందికి భూ పంపిణీ చేశారో సమగ్ర వివరణ ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో భూమి లేని దళితులు 3.60 లక్షల మంది ఉన్నారని, వారందరికీ భూ పంపిణీ చేయాలంటే సంవ త్సరానికి 20 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుంది. అధికారిక అంచనాల ప్రకారం ఇప్పటి వరకు 950 మంది దళిత కుటుంబాలకు రెండు వేల ఎకరాల మాత్రమే భూ పంపిణీ చేసినట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం నత్తనడకన నడుస్తోందని, నామమాత్రంగానే భూమి కొనుగోలు చేశారని తెలిపారు. గిరిజనులకు కూడా భూ పంపిణీ కార్యక్రమాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారో తెలపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.