Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి కన్వీనర్ ఆనందచారి
నవతెలంగాణ బ్యూరో - హైదరబాద్
తెలంగాణ రాష్ట్రలోని కవులు, కళాకారులు ఎటు వైపని తెలంగాణ సాహితి కన్వీనర్ కె. ఆనందచారి, నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, తంగి రాల చక్రవర్తి, సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 13నెలలు కావస్తున్నా ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా నియంతృత్వ ధోరణులు పెరిగిపోతున్నాయన్నారు. కవులు, కళకారులు రెండు వర్గాలుగా చీలిపోయారని పేర్కొన్నారు. మేం మాత్రం ప్రజలవైపు అని కదిలిన రచయిత వారసత్వం మనదిగా తెలంగాణ సాహితీ కవులను కళాకారులను ఏకం చేయడం కోసం జులై 13న పాలకుర్తి చాకలి అయిలమ్మ శౌర్యయాత్ర సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్షోభ కాలంలో మేధావులు వెనుకడుగు వేయొద్దని కోరారు. సిఎంకు తెలంగాణ సోయి లేదని, గుడులు, గోపురాలకే ప్రాధాన్యతిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాధనకు పోరాడిన కలాలే ప్రభుత్వ అడుగులకు మడుగు లొత్తుతున్నారని పేర్కొన్నారు.