Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కెటిఆర్కు సిఐటియు విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం, వాటర్ షెడ్, డ్వామా పరిధిలో 18 రకాల విభాగాలకు చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తు న్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కెటిఆర్ను సిఐటియు రాష్ట్ర కమిటి కోరింది. సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, వంగూరు రాములు, సభ్యులు కె సతీష్కుమార్, పి సుధాకర్, రాజమౌళి శనివారం మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానం ప్రకారం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిం చాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఉద్యోగ భద్రత, ఇతర చట్టబద్ద సౌక ర్యాలు కల్పించాలన్నారు. జూన్ 15 నుంచి సుమారు 15000 మంది సమ్మె లో ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం లేదన్నారు. ఈ సమ్మె ప్రారంభమైన తర్వాత మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఫీిల్డు అసిస్టెంట్లు గుండెపోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబసభ్యులు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.