Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ మార్గాలను అడ్డుకున్న కార్మికులు
- ర్యాలీలు,రాస్తారోకోలతో అట్టుడుకిన జిల్లాలు
నవ తెలంగాణ - యంత్రాంగం
మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మీర్పేట్లో సమ్మె చేస్తున్న కార్మికులకు బదులుగా చెత్త తీసేందుకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన కార్మికులను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం ముందు కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కార్మికులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. బోధన్లో అధికారులు ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించేందుకు ప్రయత్నించడంతో కార్మికులు శుక్రవారం వేకువజామున అడ్డుకున్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు డిపిఓ కార్యాలయాన్ని ముట్ట డించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. రామ గుండం కార్పొరేషన్ కమిషనర్ వాహనాన్ని కార్యాల యంలోకి వెళ్ళకుండా గేట్ ముందు బైఠాయించి అడ్డుకు న్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య, జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి సందర్శించి మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల్లోనూ కార్మికులు సమ్మె చేపట్టారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. వరంగల్, జనగామ మున్సిపల్ కార్యాలయాల ఆవరణలో కార్మికులు వంటావార్పు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ కార్మి కులు ర్యాలీ నిర్వహించారు. కోదాడలో మున్సిపల్ కార్మి కులు కెసిఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద దహనం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యాన మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు చీపుర్లతో ప్రదర్శన నిర్వహించారు.