Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ్, చాడ ప్రకటన
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించడం ద్వారా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు బుద్ది చెప్పాలని ఎఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు పిలుపునిచ్చాయి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించాయి. సింగరేణి గుర్తింపు తఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని తాము తీసుకున్న ఈ నిర్ణయం 'టీఆర్ఎస్ను, కేసీఆర్ను వ్యతిరేకిస్తున్న శక్తుల పునరేకీకరణ'గా ఆయా సంఘాలు అభివర్ణించాయి. ఈ మేరకు ఆయా పార్టీ నేతలు బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 5న జరిగే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఎఐటీయూసీ, ఐఎన్టీయూసీ జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమారరెడ్డి వెల్లడించారు. టీడీపీ అనుబంధ కార్మిక సంఘమైన టీఎన్టీయూసీ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అమలు చేయలేదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. మైనింగ్ బ్లాక్ను సింగరేణికి కాకుండా...ప్రయివేట్ వ్యక్తులకు అప్పజెప్పడానికి గల కారణాలేమిటో చెప్పాలని నిలదీశారు. సింగగరేణి గుర్తింపు ఎన్నికల్లో కలసి పోటీ చేస్తున్న ఎఐటీయూసీ, ఐఎన్టీయూసీ గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. కోర్టు కొట్టేసిన జీవోను సవరించడం ద్వారా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా...కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి టీఆర్ఎస్ శాపంగా మారిందని టీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సింగరేణి గుర్తింపు గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి, బొందలగడ్డను చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు నరసింహన్, జనక్ ప్రసాద్, సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ నేతలు శ్రీధర్బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.