Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల రైతు సమన్వయ కమిటీ సదస్సు బుధవారం పోలీసుల బందోబస్తు మధ్య సాగింది. సమావేశానికి ఆరంభంలోనే ముందస్తు అరెస్టులు కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంగర గ్రామ సర్పంచ్ శేఖర్ను సమావేశ ప్రాంగణం నుంచే అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ అనుచరులనూ పోలీసులు అరెస్టు చేశారు. యాచారంలో జరిగిన ఘటన పునరావృతమవుతుందని భావించిన పోలీసులు ఈ అరెస్టు పర్వాన్ని కొనసాగించారు. కొంగర సర్పంచ్ శేఖర్ను అక్రమ అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి ఖండించారు. పోలీస్స్టేషన్లో ఉన్న సర్పంచ్ను ఆయన పరామర్శించారు. అరెస్టు చేసిన పోలీసులపై, అందుకు ఉసిగొల్పిన టీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎసీపీ మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు.