Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీకి ఎస్డబ్ల్యుఎఫ్ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కార్మికులకు చెల్లించే దసరా పండుగ అడ్వాన్స్ను సత్వరమే చెల్లించాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (టీఎస్ఆర్టీసీఎస్డబ్ల్యుఎఫ్) కోరింది. దానితోపాటే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 25వ తేదీనే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆర్టీసీ కార్మికులకు కూడా అదే విధంగా జీతాలు ఇవ్వాలని కోరారు. ఎస్డబ్ల్యుఎఫ్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాంచందర్, వీఎస్ రావు తెలిపారు. అదే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్టీసీ ఎమ్డీ జివి రమణారావుకు సమర్పించారు. దసరా పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, విద్యాసంస్థలకు గతంలో ఉన్న సంక్రాంతి సెలవుల్ని కుదించి, దసరా పండుగకు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.