Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్, సీపీఐలు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఆ రెండు పార్టీల అనుబంధ కా ర్మిక సంఘాలైన ఎఐటీయూసీ, ఐఎన్టీయుసీ ప్రకటించిన నేపథ్యంలో సు మన్ పై విధంగా స్పందించారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ ంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి మాట్లాడారు. ఈ కిచిడి కూటమిని కా ర్మికులు బొందలగడ్డలో పాతి పెడతారన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వ డానికే తాము నిర్ణయం తీసుకుంటే.. విపక్ష పార్టీలు కోర్టుకు వెళ్లి అడ్డు కున్న సంగతి కార్మికులకు తెలుసన్నారు. రైతు సమితులపై హైకోర్టులో చీవాట్లు పెట్టినా.. సిగ్గులేకుండా గవర్నర్ను కలిశారని ఆయన ఎద్దేవా చేశారు.