Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రధాన కమిషనర్తో పాటు కమిషనర్ల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కమిటీనే ఇప్పటికొనసాగింది. కమిషన్ సభ్యుల గడువు కూడా ముగిసింది. గత కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాలకు సంబంధించి సభ్యుల నియామకం జరగకపోవడంతో కమిషన్ ఖాళీగా ఉంది. హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసినట్టయింది. సభ్యులు ఎవరు ఉంటారన్నది చర్చనీ యాంశమైంది. ఇన్సర్మేషన్ కమిషనర్గా రాజా సదారామ్ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.