Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండిపడ్డ మద్యం వ్యతిరేక పోరాట వేదిక
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
మద్యం వల్ల కుటుం బాలు ఛిన్నాభిన్నం అవు తున్నాయి. మహిళలపై హింస పెరుగుతున్నది. యువత రోడ్డు ప్రమాదా లకు గురవుతున్నది. దీని కి వ్యతిరేకంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బరితెగిస్తున్నది. మీ చావు మీరు చావండంటూ మద్యం విక్రయాల సమయాన్ని మరో గంట పొడిగిస్తూ ప్రజా పోరాటాలను కించపరుస్తున్నదని మద్యం వ్యతిరేక పోరాట వేదిక మండిపడింది. బుధవారం సుందరయ్య కేంద్రంలో వివిధ మహిళా సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టారు. తీరు మార్చుకోకపోతే పతనం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ ప్రభుత్వం మద్యానికి అడ్డుకట్టవేయకపోతే ఆయుధాలతో కాదు.. అగిపుల్లతో అంటించి దించేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి, కృష్ణవేణి, జయ (సీఎంఎస్), బీ.విజయ, అనసూయ (పీఓడబ్ల్యూ), గ్యార యాదమ్మ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) తదితరులు మాట్లాడారు.