Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ను కలిసిన ప్రతిపక్షాలు, సంఘాల నేతలు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 39ను రద్దు చేయాలని పలు ప్రతిపక్షాలు, సంఘాల నేతలు కోరారు. వారంతా ఒక బృందంగా బుధవారం రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిసి వినతిపత్రం అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టీజేఏసీ చైర్మెన్ కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్రావు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు రమాదేవి, అన్మేష్, బీజేపీ కిసాన్మోర్చ అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి ఉన్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కోసం రూపొందించిన జీవో 39 కారణంగా రైతుల మధ్య చిచ్చు పెట్టారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల కారణంగా టిఆర్ఎస్ నేతలకే మేలు జరుగుతుందని కోదండరామ్ తెలిపారు. జీవో 39ని రద్దు చేయాలన్న డిమాండ్తో ఈ నెల 15న వ్యవసాయ కమిషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. రైతు సమన్వయ సమితి పేరుతో ప్రజాధ నాన్ని వృధా చేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జీవో 39 పేరు తో కొత్త తరహా దోపిడీకి ప్రభుత్వం తెరలేపిందని రమణ ఆరోపించారు.