Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఎమ్ హోమ్ పరిరక్షణ సదస్సులో చుక్కా రామయ్య
- ముఖ్యమంత్రిని బిక్షాందేహీ అని అడుక్కోం
- భూముల రక్షణ కోసం కోర్టుకెళ్తాం
- స్పందించకపోతే ప్రజాకోర్టులో తేల్చుకుంటాం
- అక్టోబరు 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనాథ బాలలను అక్కున చేర్చుకుంటున్న వీఎమ్ హోమ్కు కాపలాగా ఉండాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు విరుద్ధంగా దాని భూముల్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రముఖ విద్యావేత్త, వీఎమ్ హోమ్ భూముల పరిరక్షణ కమిటీ చైర్మెన్ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కంచే చేను మేసినట్టుగా ఉందని విమర్శించారు. ఈ వ్యవహా రంపై దళిత సంక్షేమశాఖ కార్యదర్శిని కలిసి విన్నవించగా.. 'అనాథ బాలల గురించి, వీఎమ్ హోమ్ చరిత్ర గురించి.. ఇతర అన్ని విషయాల గురించీ ముఖ్యమంత్రికి వివరిం చాం.. అయినప్పటికీ ఆయన రాచకొండ కమిష నరేట్కు స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. మీరెళ్లి ఆయనతోనే మాట్లాడుకోండి..' అంటూ సలహాని చ్చారని గుర్తుచేశారు. దీన్నిబట్టి వీఎమ్ హోమ్ భూములపై ప్రభుత్వం ఏ విధంగా వ్యవహ రిస్తున్నదనే విషయం విదితమవుతున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో భూముల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రిని దేహీ అంటూ అడగబోమని చెప్పారు. దీనిపై కోర్టుకెళ తామని.. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజాకోర్టులో సర్కారు సంగతి తేలుస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్లోని వీఎమ్ హోమ్ అనాథ బాలల వసతిగృహ భూములను రాచకొండ పోలీస్ కమిషరేట్కు కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సరూర్నగర్లో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. వీఎమ్ హోమ్ భూముల పరిరక్షణ కమిటీ కన్వీనర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చుక్కా రామయ్యతోపాటు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర నేత బాలమల్లేశ్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత గోవర్థన్, గాదె ఇన్నయ్య (ప్రజా తెలంగాణ), రవిచందర్ (టీపీఎఫ్), అరుణ (న్యూడెమోక్రసీ), నాగటి నారాయణ (తల్లిదండ్రుల సంఘం) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజి మాట్లాడుతూ.. వీఎమ్ హోమ్ నిబంధనావళి ప్రకారం దానికి రాష్ట్ర గవర్నర్ చీఫ్ ప్యాట్రన్గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషరేట్కు భూములు కేటాయించిన విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్కు తెలిపిందా? లేదా? అని ప్రశ్నించారు. తక్షణం ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గోవర్థన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన చాలా భూములు అన్యాక్రాంతం అయ్యాయి.. మేం వాటిని వెలికితీసి ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడతామంటూ టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీనిచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ భూముల మీద పిచ్చితో వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి డబ్బు పిచ్చి, కమిషన్ల పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు.
సదస్సు డిమాండ్లు..
- వీఎమ్ హోమ్ అనాథ విద్యార్థుల భూములను రాచకొండ కమిషనరేట్కు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోనెం.48,50లను వెంటనే రద్దు చేయాలి
- అనాథ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఇంటర్, డిగ్రీ, పీజీ, టెక్నికల్ రెసిడెన్షియల్ కాలేజీలను నిర్మించాలి
- రిలయన్స్కు కేటాయించిన భూమి లీజును రద్దు చేయాలి
- వీఎమ్ హోమ్ అభివృద్ధికి, పర్మినెంట్ టీచర్ల నియామకానికి చర్యలు చేపట్టాలి
- రైతు బజారు పేరిట వీఎమ్ హోమ్కు ప్రభుత్వం బకాయిపడ్డ రూ.35 కోట్లను వెంటనే విడుదల చేయాలి
- వీఎమ్ హోమ్ భూములను రీ సర్వే చేయాలి కార్యాచరణ..
- ఈనెల 19న గవర్నర్కు వినతిపత్రం
- 22న ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రికి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి, సీఎస్కు మెమోరాండాల అందజేత
- 23,24,25 తేదీల్లో ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ
- అక్టోబరు 2 నుంచి వీఎమ్ హోమ్ భూముల వద్ద నిరవధిక నిరాహారదీక్ష