Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ మాస్ ఫోరం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంచ ఐలయ్యలాంటి వారిని నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్ ఫోరం) డిమాండ్ చేసింది. ఐలయ్యలాంటి గొప్ప మేధావిని దేశద్రోహులతో పోల్చటం సరికాదని ఫోరం రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. అరబ్ దేశాల్లో మాదిరిగా మనదేశాల్లో కూడా చట్టాలు తీసుకొచ్చి ఐలయ్యలాంటి వారిని ఉరితీయాలంటూ మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టీజీ వెంకటేశ్పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఐలయ్యకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు.