Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేతనాలు, ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంతో కామారెడ్డి జిల్లాలో నిరుపేద ఎస్సీ కులానికి చెందిన హోంగార్డు జంగం శివశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఐ ఆవేదన వ్యక్తం చేసింది. అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదు కోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రక టనలో డిమాండ్ చేశారు. హోంగార్డులను క్రమబద్దీకరిసా ్తమంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అసెంబ్లీలో ప్రక టించారని గుర్తుచేశారు. ఆప్రకటన ఇంతవరకు అమ లుకు నోచుకోలేదని విమర్శించారు. దీంతో తీవ్రమానసిక వేదనకు గురైన శివశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
సివి చారి మృతిపట్ల సంతాపం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది సివి చారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చాడ పేర్కొన్నారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.