Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
కొత్తగా నెలకొల్పుతున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి 9.65శాతం వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పి.ఎఫ్.సి.), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్.ఇ.సి.) సంస్థలు సంసిద్ధత వ్యక్తంచేశాయి. 9.65 శాతం వడ్డీకే రూ.40 వేల కోట్ల రుణం అందించనున్నాయి. దీని వల్ల తెలంగాణ జెన్కోకు రూ.400 కోట్ల వరకు నగదు ప్రయోజనం చేకూరినట్టయిందని జెన్కో సిఎండి ప్రభాకర్రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడానికి జెన్కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లను నెలకొల్పుతున్నామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి అంతా ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జరగాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జెన్కోతో పాటు, సింగరేణి, ఎన్టీపీసీ తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు ఐదో యూనిట్ నిర్మాణానికి రూ.4.009 కోట్ల రుణం అందించడానికి నిర్ణయించిన పి.ఎఫ్.సి. ప్రతినిధులతో విద్యుత్ సౌధలో సిఎండి ప్రభాకర్రావు, ఇతర అధికారులు సోమవారం సమావేశమయ్యారు.