Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర భూ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది. ఈ సదస్సులో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, జేఏసీ చైర్మెన్ కోదండరామ్తో పాటు 10 వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పాల్గొననున్నారని తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటన విడుదల చేశారు.