Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూడో ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో దేశానికి చెందిన 625 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొననున్నారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో 18 ప్రదేశాల్లో ఫోటో ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ, లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా మూడో సారి నిర్వహిస్తున్నఈ ఫోటోగ్రఫీ ఫెస్టివల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందన్నారు.