Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దసరా పండగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్- విశాఖ- కాకినాడ ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు చీఫ్పీఆర్వో ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈనెల 28, 30 తేదీల్లో సాయంత్రం 06.50 గంటలకు హైదరాబాద్లో ఈ రైళ్లు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.00 గంటలకు విశాఖకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణం రైళ్లు ఈనెల 29, అక్టోబర్ 1 తేదీల్లో రాత్రి 07.20 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.50 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటాయి. అలాగే హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్టుకు ఈనెల 27, 29 తేదీల్ల సాయంత్రం 06.50 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.35 గంటలకు కాకినాడపోర్టుకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో కాకినాడ పోర్టు నుంచి ఈనెల 28, అక్టోబర్ తేదీల్లో సాయంత్రం 05.55 గంటలకు కాకినాడ పోర్టు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.10 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటాయి. అలాగే అక్టోబర్ 1న హైదరాబాద్ నుంచి మరో ప్రత్యేక రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ రైలు రాత్రి 11.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
బతుకమ్మ, దసరా పండుగలకు
అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటు చేయాలి: ఎంపీ
బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-కాగజ్నగర్, సికింద్రాబాద్-విజయవాడల మధ్య ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు, ప్రస్తుతం నడిచే రైళ్లకు అదనపు బోగీలను చేర్చవలసిందిగా కోరుతూ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్కు లేఖ రాశారు. బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నివశిస్తున్న తెలంగాణ ప్రజలకు ప్రయాణ వెసులుబాటు కలిగించేలా ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్, విజయవాడ సెక్షన్లలో అదనపు రైళ్లను, అలాగే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.