Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబ్ఆప్షన్ల నమోదుకు 21వరకు అవకాశం
- ఉన్నత విద్యామండలి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 12 కొత్త బీఎడ్ కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎడ్సెట్ కౌన్సెలింగ్లో ఆ కాలేజీలను ఉన్నత విద్యామండలి సోమవారం చేర్చింది. మరో పాత కాలేజీకి అవకాశం లభించింది. 12 కొత్త బీఎడ్ కాలేజీలను ఎడ్సెట్ కౌన్సెలింగ్లో చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆగమేఘాల మీద ప్రభుత్వం ఆ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఆ వెంటనే తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ((టీఏఎఫ్ఆర్సీ) సోమవారం ఫీజు ఖరారు చేసింది. ఆ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.13,500, ప్రత్యేక ఫీజు రూ.3 వేలుగా నిర్ణయించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎడ్సెట్ కౌన్సెలింగ్లో చేర్చుతున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.