Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తమ గుర్తింపును వెల్లడించని కొంత మంది వ్యక్తులు సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను చంపుతామని బెదిరించడం అనాగరికమని మావన హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్కుమార్, ఉపాధ్యక్షులు జీ.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛ మనిషి ప్రాథమిక హక్కన్నారు. ఆ పుస్తకం శీర్షిక తమ మనషులను గాయ పరిచిందని వైశ్య కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ప్రత్యామ్యాయ ఆలోచనను వ్యక్తీకరించిన ఐలయ్యను చంపుతామని సంఫ్ు పరివార్కు చెందిన వారు బెదిరిస్తున్నారన్నారు. ఇటువంటి కుట్రలో వైశ్యులు భాగం కావొద్దని కోరుతున్నామన్నారు. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను ఖండిస్తూ ఇంకోక పుస్తకం రాసే హక్కు వైశ్య వేధావులకుందన్నారు.