Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సెమినార్ పిలుపు
- 50 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి:టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మను ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ బతుకమ్మ నిర్వహిస్తున్నట్టు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) పిలుపునిచ్చాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభు త్వంపై ఒత్తిడి పెంచడానికి నిరసన వ్యక్తం చేయాలని కోరాయి. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంయుక్తాధ్వర్యంలో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల హవా నడుస్తున్నదని చెప్పారు. కేజీ టు పీజీలో భాగంగానే గురుకులాలని ప్రభుత్వం చెప్తోంద న్నారు. గురుకులాల్లో కేజీ లేదు, పీజీ లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కేటగిరీలు కలిపి 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కేజీ తరగతులు ప్రవేశపెడితే మరో 20 వేల పోస్టులు అవసరమవుతాయని అన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ విజరు కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇంట్లో కొలువుల జాతర, ప్రాజెక్టుల పేరుతో నిధుల జాతర వచ్చిందన్నారు. మాయమాటల పోటీల్లో కేసీఆర్కు ఎదురులేదని ఎద్దేవా చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ మాట్లా డుతూ మూడున్నరేండ్లయినా డీఎస్సీ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నిం చారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుంటే నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవకుమార్, యువతుల కన్వీనర్ సుధ, నగర కార్యదర్శి విజరుకుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకాష్కరత్, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.