Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
15 ఏండ్లలోపు పిల్లలకు వచ్చే రూబెల్లా - మీజిల్స్ (తట్టు) నివారణ కోసం ఎంతమందికి వ్యాక్సిన్ (టీకాలు) వేశారో పూర్తి వివరాలు తెలియజేయాలని వైద్యఆరోగ్యశాఖ, పాఠశాల విద్యా శాఖలను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రంగనాథన్, న్యాయ మూర్తి ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. కొన్ని బడుల్లో టీకాలు వేయ లే దని, అలా నిరాకరించడంపై డాక్టర్ శ్రీకృష్ణ వేసి న ప్రజాహిత వ్యాజ్యాన్ని బెంచ్ విచారిం చింది. 97 శాతం పిల్లలకు టీకాలు వేశామని, నూరు శాతం టీకాలు వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్కుమార్ చెప్పారు. హైద రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 95 శాతం అయిం దన్నారు. మిగిలిన జిల్లాల్లో ఇంకా ఎక్కువే వేశామన్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ఆసక్తి చూపనం దున ప్రభుత్వం వారిపై ఒత్తిడి చేయలేదన్నారు. విచారణ అక్టోబర్ 3కి వాయిదా పడింది.