Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో రహస్య కెమెరాల అమ్మకాలు, వాటి వినియోగంపై ఏవిధమైన నియంత్రణ తీసుకుంటున్నారో తెలియజేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. స్పై కెమెరాల వాడకంపై ఆంక్షలు లేకపోవడంతో స్త్రీలు, విద్యార్థిల హక్కులు, గోప్యతకు విఘాతం ఏర్పడుతోందని హెవెన్ హౌమ్స్ సొసైటీ నిర్వహకురాలు వరలక్ష్మీ వేసిన ప్రజాహితవ్యాజ్యాన్ని బెంచ్ విచారించింది. ప్రతివాదులైన తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హాటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, వస్త్రాలయాలు, ఆఖరిక ివస్త్రాలు మార్చుకునే రహస్య గదుల్లో కూడా స్పై కెమెరాలు పెట్టేస్తున్నారని పిటిషనర్ లాయర్ రచనారెడ్డి వాదించారు. మహిళల గోప్యతను దెబ్బతీసేలా చిత్రీకరించి కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఇంకొందరైతే ఆన్లైన్లో పెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పై కెమెరాల అమ్మకాలపై నియంత్రణలేదని, ఎక్కడపడితే అక్కడ అమ్మేస్తున్నారని, ప్రభుత్వాల నియంత్రణ ఉండేలా, లైసెన్స్లు ఉంటేనే విక్రయించేలా ఆదేశా లివ్వాలని ఆమె బెంచ్ను కోరారు. విచారణ వచ్చే నెల 24కి వాయిదా పడింది.
నాగార్జున సిమెంట్ కంపెనీకి హైకోర్టు నోటీసులు
వాయి, జలకాలుష్యాలకు కారణమైన నాగార్జున సిమెంట్స్ మూడో దశ పనుల్ని అడ్డుకోవాలన్న కేసులో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నాగార్జున సిమెంట్స్లకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలోని నాగార్జున సిమెంట్స్ మూడో దశ విస్తరణ పనులకు ప్రజాభిప్రాయసేకరణ తూతూమంత్రంగా జరిగిందని, అధికారులు జనాన్ని బెదిరించడంతో అభ్యంతరాలు రికార్డు కాలేదని మట్టంపల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన సేవాభారు యువజన సంఘం ప్రతినిధి ఎం గోవింద్నాయక్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తేత ఫలితం లేకపోవడంతో హైకోర్టుకు వచ్చామని వివరించారు. విచారణను వచ్చే నెల 10కి వాయిదా పడింది.