Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనాలంటూ పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. బుధవారం కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. మొబైల్ సంబంధిత రంగంలో ఈ నెల 27న కేంద్రం నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి 'సస్టెనబుల్వైఫై' అనే అంశంపైన ప్రసంగిస్తారు. దేశంలో తొలి సారిగా కమ్యూనికేషన్ శాఖ, సెల్యూలర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో టెక్నాలజీ, వ్యాపారం, పాలసీ, డిజిటల్ లైఫ్ అనే నాలుగు ప్రధానమైన అంశాలపై చర్చించనున్నారు.