Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారసత్వ అమలుకు సర్కార్కు కృషి : టీఎస్ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ
నవతెలంగాణ-యైటింక్లైన్కాలనీ
కార్మిక హక్కులను పరిరక్షించే సత్తా టీబీజీకేఎస్కే ఉందని, కార్మికవర్గం విశ్వాసాన్ని నిలుపుకుని, వారసత్వ ఉద్యోగాల అమలుకు కృషి చేస్తామని టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. బుధవారం రామగుండం రీజియన్-2 ఏరియాలోని ఓసీపీ-3 బేస్వర్క్షాప్, కృషి భవన్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నప్పటికీ కార్మిక ద్రోహులు కోర్టు వ్యాజ్యాల ద్వారా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా వారసత్వ ఉద్యోగాలు టీబీజీకేఎస్ సంఘంతోనే సాధ్యమౌతుందని తెలిపారు. మరుగున పడిన సంఘాలు కుటమిగా ఏర్పడి కార్మికవర్గ హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తున్న టీబీజీకేఎస్, టీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నాయని అన్నారు. ద్వంద్వ విధానాలతో ముందుకు సాగుతున్న తొత్తు..పొత్తు సంఘాలను ఓడించి బుద్ది చెప్పాలని కోరారు.