Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరం నిర్మాణంపై ఎన్జీటీ
- ప్రాజెక్టుపై తెలంగాణ ద్వంద్వ వాదనలు
- తాగునీటి ప్రాజెక్టుని ఓసారి, బహుళ ప్రాజెక్టు అని మరోసారి వాదన
- కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్న పిటిషనర్ న్యాయవాది
- పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వెల్లడి
- ఇరు పక్షాలు సుధీర్ఘంగా వినిపించిన వాదనలు..నేడూ విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కాళేశ్వరం 'తాగునీటి' ప్రాజెక్టు అని, గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించే 'లక్ష్యం'తో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్కు తెలిపింది. తాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులు అవసరం లేదని వాదించిన రాష్ట్ర సర్కారు... ఒకవేళ భవిష్యత్తులో ఆ అనుమతులు వస్తే ఈ తాగునీటిని 'సాగు' అవసరాలకు వినియోగిస్తామని పేర్కొంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుపట్టారు. సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా చెబుతూ.. ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ముమ్మాటికీ సాగునీటి ప్రాజెక్టు అని... రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతుల కోసం చేసిన దరఖాస్తుల్లోనూ 'సాగునీటి' ప్రాజెక్టుగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. మిషన్భగీరథ ప్రాజెక్టు పైప్లైన్ నిర్మాణాలను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చిత్రపటంలో చేర్చి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని మాత్రమే అభ్యర్థిస్తున్నామని వివరించారు. కాగా అటవీ స్థలంలో, వన్యప్రాణి సంరక్షణ స్థలానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లేవనెత్తిన సందేహాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. దీంతో కేసు విచారణను నేడూ కొనసాగిస్తామని ఎన్జీటీ పేర్కొంది. కేసు విచారణలో భాగంగా 'ప్రాజెక్టు నిర్మాణం పనులు మూడు నెలలు ఎందుకు ఆపకూడదు' అని ధర్మాసనం ప్రశ్నించింది. పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిలుపుదల చేయాలంటూ ఎండీ హయతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ఎన్టీటీలో విచారణకు వచ్చింది. జస్టిస్ జావెద్రహీం నేతృత్వంలోని ధర్మాసనం కేసు విచారించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
తెలంగాణ ప్రభుత్వ ద్వంద్వ వాదనలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ద్వంద్వ వాదనలు వినిపించారు. మొదట ఉదయం జరిగిన విచారణలో వాదిస్తూ.. కాళేశ్వరం కేవలం తాగునీటి ప్రాజెక్టు మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి అక్కడి నుంచి బ్యాక్ ఫ్లో ద్వారా మిడ్మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ మీదుగా హైదరాబాద్కు తాగునీటి అవసరాలకు మళ్లించడం ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. తాగునీటి అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యతని చెప్పుకొచ్చారు. పైగా ఈ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ సైతం పూర్తి చేశామని చెప్పారు. ఇక మధ్యాహ్నం జరిగిన విచారణలో వాదిస్తూ.. కాళేశ్వరం బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు అని యూటర్న్ తీసుకున్నారు. తాగునీటి కోసం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, సాగునీటి వినియోగానికి అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని చెప్పారు. భవిష్యత్తులో అటవీ, పర్యావరణ అనుమతులు వస్తే తాగునీటిని సాగుకు వినియోగిస్తామని పేర్కొన్నారు. పైగా లక్ష కోట్లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతుందని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ, అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేశారని, మహారాష్ట్ర అభ్యంతరం తెలియజేయడంతో రాలేదని చెప్పారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందం చేసుకుందని, ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశ మయ్యారని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చామని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అటవీభూమిని వినియోగించబోమని, మళ్లించబోమని చెప్పారు. అలాగే మూడు నెలల పాటు కేసు విచారణను నిలిపేయాలని, ఆ తరువాత పర్యావరణ, అటవీ అనుమతుల పురోగతిని వివరిస్తామని తెలిపారు.
కాళేశ్వరం ముమ్మాటికీ సాగునీటి ప్రాజెక్టే : పిటిషనర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది సంజరు ఉపాధ్యాయ వాదించారు. ముకుల్రోహత్గీ వాదనలను ఆయన తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు రాలేదని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సైతం తెలుసని అన్నారు. తాము సాగు, తాగునీటి ప్రాజెక్టులు వ్యతిరేకం కాదని, కానీ ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తే అందుకు అవలంబించాల్సిన పద్ధతులను విస్మరించరాదని అన్నారు. కాళేశ్వరం పూర్తిగా సాగునీటి ప్రాజెక్టు అని, పాక్షికంగా తాగునీటి అవసరాలనూ తీర్చనుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ అనుమతుల కోసం చేసిన దరఖాస్తుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టును 'సాగునీటి'గా పేర్కొన్నారని వివరించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను ధర్మాసనానికి అందజేశారు. పైగా ఈ ప్రాజెక్టు 'అంతరాష్ట్ర ప్రాజెక్టు' అని స్పష్టం చేశారు. కానీ మహారాష్ట్రలో ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినా.. పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు రావాలంటే చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుందని చెప్పారు. ఈ యేడాది జనవరి నుంచి నిర్మాణం పనులు మొదలు పెట్టారని తెలిపారు. పైగా అటవీ స్థలాన్ని సైతం వినియోగిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంజరు ఉపాధ్యాయ స్వయంగా ప్రాజెక్టు స్థలం వద్ద సాగుతున్న నిర్మాణాలపై తీసిన ఫోటోలను ధర్మాసనానికి అందజేశారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయనడానికి మహారాష్ట్ర సమర్పించిన అఫిడవిట్ నిదర్శనమని చెప్పారు. అలాగే మహారాష్ట్ర ఒప్పందంలోనూ సాగునీటిపై సహాకారం గురించి పేర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం లక్ష కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నామని వెల్లడించిందని, ఇంతపెద్దమొత్తంలో నిర్మించే ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై కూడా అంచనా వేయాలి కదా అని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా అని తెలంగాణను ప్రశ్నించింది. అయితే అంతకముందే ముకుల్రోహత్గీ వెళ్లిపోవడంతో... ఆయన జూనియర్ న్యాయవాది సమాధానం చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని, అయితే ఎక్కడా అటవీభూముల్లో ఉల్లంఘనలు జరగడం లేదని చెప్పారు. అనంతరం కేసును గురువారానికి వాయిదా వేశారు.
అంతరాష్ట్ర ప్రాజెక్టు' అని స్పష్టం చేశారు.
పర్యావరణ, అటవీశాఖ అనుమతులు వచ్చే వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులు మూడు నెలలు నిలుపుదల చేయొచ్చు కదా అని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వ్యాఖ్యానించించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుదీర్ఘంగా వాదనలు విన్నది. ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ, అటవీశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు విచారణను మూడు నెలల పాటు నిలుపుదల చేస్తే అనుమతుల పురోగతిపై ఆ తరువాత ఎన్జీటీకి తెలియజేస్తామని పేర్కొంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి ఈ నేపథ్యంలో ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. కాగా సరైన అనుమతులు లేకుండానే ఈ యేడాది జనవరి నుంచి రాష్ట్ర సర్కారు ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
మంత్రి హరీశ్ తీవ్ర దిగ్భ్రాంతి
- సమగ్ర విచారణకు ఆదేశం
- మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్ వద్ద పైకప్పు కూలి ఏడుగురు దుర్మరణం పాలవడం పట్ల నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మంత్రి సమగ్ర విచారణకు ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామం వద్ద నిర్మిస్తున్న పంప్హౌస్లో డ్రాప్ట్ ట్యూబ్ పైకప్పు కూలిన విషయాన్ని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆనంద్ ఘటనాస్థలం నుంచి తనకు సమాచారం అందించారని మంత్రి ఒక ప్రకటనలో వివరించారు. మృతుల్లో ఆరుగురు జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన వారని, ఒకరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ప్రాంతానికి చెందిన వారు అని సిరిసిల్లా జిల్లా యంత్రాంగం మంత్రికి పంపిన నివేదికలో తెలిపింది. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే మంత్రి జలసౌధ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. డ్రాఫ్ట్ ట్యూబ్ పైకప్పులోని ఎయిర్ పాకెట్స్లో అనూహ్యంగా పేలుడు సంభవించటంతో నాలుగు నుంచి ఆరు టన్నుల బరవున్న గ్రానైట్ రాయి కూలిందని, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మరళీధరరావు తెలిపారు. ఆ సమయంలో కార్మికులు భోజన విరామం కోసం బయటికి వస్తున్నారని తెలిపారు. ఘటనకు కొద్ది సెకన్ల ముందు ఇంజినీర్లు అదే దారిలో బయటకు వచ్చారని ఆయన వివరించారు. కొందరు కార్మికులు అక్కడ చిక్కుకు పోవటం వల్ల ప్రమాదానికి గురయ్యారని మంత్రికి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన విచారణ నివేదిక అందిన తర్వాత నిపుణుల సూచనలు, సలహాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ చెప్పారు.