Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగకుండానే రూ. 771 కోట్లు
- మొత్తం షాపులు 2,216
- దరఖాస్తులు 41 వేలు
- ఆదాయం రూ. 411కోట్లు
- లైసెన్సుల రూపంలో రూ.110 కోట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రారంభంలోనే ఆబ్కారీ ఆదాయం అదిరింది. ఎక్సైజ్ అధికారుల అంచనాలకు మించి నూతన మద్యం షాపుల దరఖాస్తుల రూపంలో సర్కారుకు ఏకంగా రూ. 411 కోట్ల ఆదాయం లైసెన్స్ రూ పంలో రూ. 110 కోట్లు వచ్చింది. వీటికి అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ రూపంలో మరో రూ.250 కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా నూతన ఎక్సైజ్ పాలసీ రూపంలో ఆరంభంలోనే రాష్ట్ర సర్కా రుకు సుమారుగా రూ.771 కోట్ల ఆదాయం వచ్చి నట్టయింది. దరఖాస్తు రుసుంను చెల్లించే అవకాశం లేదు. దరఖాస్తుల రూపంలో రూ.250 కోట్లు సమకూరుతుందని ఆబ్కారీ అధికారులు అంచనా వేశారు కాని ఆశించిన దానికంటే అదనంగా
రూ.161 కోట్ల ఆదాయం వచ్చింది. 41వేల దరఖాస్తులు రాష్ట్రంలో 2,216 మద్యం షాపులకు గాను 41వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు రూపంలో చెల్లించిన రూ. లక్షను తిరిగి చెల్లించరు. షాపుల లైసెన్స్ పొందేందుకు గాను రూ. 5లక్షలను దరఖాస్తు సమయంలోనే చెల్లించారు. ఒకవేళ డ్రాలో మద్యం షాపు రాకపోతే లైసెన్స్ ఫీజును మాత్రం తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తు రుసుంను రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంచినా మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత ఏడాది దరఖాస్తుల రూపంలో రూ.200 కోట్ల ఆదాయం రాగా ఈ సారీ రెండింతలు పెరిగింది. ఒక్కో మద్యం షాపు కోసం సుమారు 50 మంది పోటీ పడ్డారు. మద్యం షాపుల నిర్వహణకు గాను ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. పోటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కో మద్యం షాపు కోసం ఒకోక్కరు వేర్వేరుగా పేర్లతో 5 నుంచి 10 దరఖాస్తులు రావడం విశేషం. ఇందుకుగాను రూ.10 లక్షలు దరఖాస్తు రూపంలో చెల్లించారు.
చివరి రోజు దరఖాస్తుల వెల్లువ
నూతన మద్యం షాపుల కోసం ఈ నెల 13 దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైంది. తొలి ఆరు రోజుల్లో మందకోడిగా సాగింది. కాని చివరి రోజున దరఖాస్తుల వెల్లువెత్తడంతో ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. ఒక్క మంగళవారం సుమారు 22వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.
మూడు జిల్లా నుంచి అధిక దరఖాస్తులు
వరంగల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ మూడు జిల్లాల నుంచే దాదాపు 13వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఒక్క నల్లగొండ జిల్లా నుంచే 6470, దరఖాస్తులు, సూర్యాపేట నుంచి 3050 దరఖాస్తులు, వరంగల్ నుంచి 3480 దరఖాస్తులు వచ్చాయి.