Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీ బుద్ధభవన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు గురువారం శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ కోసం వంద మంది గిరిజన అభ్యర్థులను ఎంపిక చేశారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ లక్ష్మన్ ఈ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధన కోసం కష్టపడి చదవాలని అభ్యర్థులకు సూచించారు. ఆదిలాబాద్, ఏటూరు నాగారం, భద్రాచలం కేంద్రాల్లోనూ ఇదే శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. అనుభవ మున్న ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తామ న్నారు. గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సముజ్వల, శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ ఎల్ శ్రీరాములు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.