Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం మైనర్ బాలికలను అక్రమంగా నిఖా చేసుకుంటూ పట్టుబడిన అరబ్ షేక్లు, వారికి సహకరించిన దళారులు, ఖాజీల ను కఠినంగా శిక్షించాలని ఆవాజ్ రాష్ట్ర కమిటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిం ది. ముస్లిం మైనర్ బాలికల అక్రమ రవాణాను నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆవాజ్ రాష్ట్ర కమిటి ఉపాధ్యక్షులు మహ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ముస్లింల పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది బ్రోకర్లు నిఖాల ముసుగులో అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుకు లాలూచి పడే ఖాజీలు అరబ్షేక్లకు సహకరిస్తూ పేద ముస్లిం కుటుంబాల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు పనిచేస్తున్నాయన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో తరుచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా తెలంగాణ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. పేదరిక నిర్మూలన, ముస్లిం మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని, అక్రమాలకు పాల్పడుతున్న బ్రోకర్లు, ఖాజీలను కఠినంగా శిక్షించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్నారు.