Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) 33వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మౌలాలిలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఇతర పారా మిలటరీ దళాల తరహాలోనే ఆర్పీఎఫ్కు కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల స్థాయిని ప్రకటించినందుకు గుర్తుగా ఈ వ్యవస్థా పక దినోత్సవం నిర్వహిస్తారు. పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే అదనపు జీఎం జాన్ థామస్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించి రైల్వే రక్షక దళం ప్రదర్శించిన పరేడ్ను వీక్షించారు.