Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైకోర్టుకు కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు ఆరుగురూ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. డీవీఎస్ఎస్ సోమయాజులు, కొంగర విజయలక్ష్మీ, పోట్లపల్లి కేశవరావు, ఎం. గంగారావు, అభినంద్కుమార్ షావిలి, టి.అమర్నాథ్గౌడ్లతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ మొదటి కోర్టు హాల్లో ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కొత్త జడ్జీల కుటుంబసభ్యులు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా జస్టిస్ ఇలంగో శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు.