Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గుత్తికోయలపై ఫారెస్టు అధికారులు చేసిన దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిడిఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. సంఘటన జరిగిన తాడ్వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని జలగలంచ గ్రామాన్ని ఈ నెల 21న ఓపిడిఆర్, గ్రామీణ పేదల సంఘం, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో సందర్శించి, బాధితులను పరామర్శించినట్టు జతిన్కుమార్, పడిగ ఎర్రయ్య, డి.విజేందర్రావు, జి. వెంకటాద్రి, పాము రమేశ్, కె.ఎర్రబాబు తెలిపారు. గుత్తికోయల ఇండ్లను తిరిగి వెంటనే నిర్మించి ఇవ్వాలన్నారు.