Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన గిరిజన నాయకులు అసంతృప్తితో ఉన్నారు.. గుత్తి కోయలపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినా రాష్ట్ర నాయకత్వం కనీసం స్పందించకపోవడాన్ని కాంగ్రెస ్పార్టీ అనుబంధ గిరిజన నేతలు ఆవేదన చెందారు. గిరిజన సమస్యలపై వివక్ష చూపడం సరికాదని అన్నారు. హరిత హారం పేరుతో ప్రభుత్వం గిరిజన భూములు లాక్కుంటుంటే ఈ విషయంలో పార్టీ సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఒక సీనియర్ నేత అభిప్రాయ పడ్డారు. వామపక్షాలు, టీటీడీపీ నేతలు గుత్తికోయ బాధితులతో మాట్లా డారని, ప్రతిపక్షపార్టీగా ఉంటూ ఆ బాధ్యతను ముందుండి చేయడంలో వెనుకపడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వం వెంటనే కదిలితే బాగుంటుందని సూచిస్తున్నారు.